రాజధాని రైతుల విషయంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

రాజధాని రైతుల విషయంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం రాజధాని రైతుల విషయంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

Update: 2019-08-30 01:47 GMT

రాజధాని అమరావతిలో శుక్రవారం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పర్యటించనున్నారు. రాజధానిపై మంత్రి బొత్స చేసిన ప్రకటనలపై రాజధాని రైతులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో పవన్‌ని కలసి సమస్యను వివరించారు. రెండు రోజులు రాజధానిలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తానని పవన్‌ రాజధాని రైతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు మంగళగిరిలో బయలుదేరి నవులూరు, కృష్టాయపా లెం, యర్రబాలెం, తుళ్లూరు మండలంలోని ఐనవోలు, శాఖమూరు, అనంతవరం, దొండపాడు, రాయపూడి గ్రామాలలో పర్యటించి రైతులు, రైతు కూలీలతో సమావేశమై సమస్యలపై చర్చిస్తారు. శనివారం రాజధానిలోని ఆయన పార్టీ కార్యాలయంలో రాజధాని రైతులు, రైతు కూలీలతో ఇతర వర్గాలవారితో పవన్‌ సమావేశం ఏర్పాటు చేసి, రాజధాని ప్రాంత సమస్యలపై స్పందించనున్నారు.

Tags:    

Similar News