పొదల్లో బోసినవ్వుల చిన్నారి

Update: 2019-09-24 10:59 GMT

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. పొత్తిళ్లలో ఉండాల్సిన పసిపాప ముళ్ల పొదల్లో అచేతనంగా పడి ఉంది. బి.కొత్తకోటలో పంజూరమ్మ గుడి వీధిలో ఈ దారుణం జరిగింది. తెల్లవారు జామున అటువైపుగా వెళ్తున్న ఓ మహిళ శిశువు ఏడుపును గమనించింది. పొదల్లో ఉన్న పాపకు పాలిచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్లింది. పసిగుడ్డును గుర్తు తెలియని మహిళ ముళ్ల పొదల్లో పడేసింది. అయితే ఆడపిల్లకు జన్మనిచ్చినందుకే ఇలా చేసుంటారని స్థానికులు చెప్తున్నారు. ముక్కుపచ్చలారని పసికందును చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బంగారు తల్లి భారమా అంటూ అందరూ విచారం వ్యక్తం చేశారు.

Full View

Tags:    

Similar News