ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణ జిల్లాలో పెద్దఎత్తున నగదు, బంగారం పట్టుబడింది. తిరువూరులో అక్రమంగా తరలిస్తున్న బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోకి వచ్చిన వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న దాదాపు రూ. 1.37 కోట్ల విలువైన నగదును, బంగారం స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.