Gudivada Amarnath: హింసాత్మక కార్యక్రమాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రావు
Gudivada Amarnath: తిరుపతి లడ్డుపై వాస్తవాలు బయటకు రావడంతో వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని మాజీమంత్రి అమర్నాథ్ ఆరోపించారు.
Gudivada Amarnath: తిరుపతి లడ్డుపై వాస్తవాలు బయటకు రావడంతో వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని మాజీమంత్రి అమర్నాథ్ ఆరోపించారు. సీఎం చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే పక్క ప్లాన్ ప్రకారం దాడి చేశారని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ, చంద్రబాబు కుటుంబం భూదోపిడీ గురించి ప్రజల్లో చర్చ జరుగుతుందన్నారు. ప్రజల దృష్టి మరల్చడం కోసం వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి హింసాత్మక కార్యక్రమాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.