విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పెరుగుతున్న వ్యతిరేకత

* స్టీల్‌ప్లాంట్ పట్ల బీజేపీ సానుకూలంగా ఉంది: పురంధేశ్వరి * ప్రజా అభిప్రాయాన్ని పార్టీ పెద్దలకు వివరిస్తాం: పురంధేశ్వరి

Update: 2021-02-07 09:20 GMT

(ఫైల్ ఇమేజ్)

విశాఖ స్టీల్‌ప్లాంట్ పట్ల బీజేపీ సానుకూలంగా ఉందన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి. ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇప్పుడున్న ప్రజా అభిప్రాయాన్ని పార్టీ పెద్దలకు వివరిస్తామన్నారు. స్టీల్‌ప్లాంట్‌పై ప్రకటన చేసిన తర్వాతే తమకు తెలిసిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌తో విశాఖ వాసులకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల కోసం ప్రయత్నిస్తామని పురంధేశ్వరి స్పష్టం చేశారు.

Tags:    

Similar News