కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ దంపతులు

Update: 2021-03-02 09:32 GMT

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ దంపతులు

ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్‌ దంపతులు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. విజయవాడలోని జీజీహెచ్‌లో టీకా తీసుకున్నారు. తమకు కొవాగ్జిన్ ఇచ్చారన్న గవర్నర్‌.. ప్రజలకు నూతన జీవనం ఇవ్వడానికి ఈ వ్యాక్సిన్ వచ్చిందిని వివరించారు. రాత్రింబవళ్లు వైద్య సిబ్బంది పనిచేసి కోవిడ్‌తో పోరాడారని అందరూ వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని సూచించారు గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌. అర్హులైన వారంతా టీకాలు వేయించుకునేందుకు ముందుకు రావాలన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని గవర్నర్‌ పేర్కొన్నారు.

Full View


Tags:    

Similar News