ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు బంగారు పతకం

ఇన్నోవేటివ్ ఏఫ్​జీఏ ఆన్​లైన్​లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో కృష్ణా జిల్లా ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు బంగారు పతకం సాధించారు.

Update: 2019-12-05 08:16 GMT
ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు సమీర్, నాగరాజు, జాన్​పాల్​

నూజివీడు: ఇన్నోవేటివ్ ఏఫ్​జీఏ ఆన్​లైన్​లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో కృష్ణా జిల్లా ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు బంగారు పతకం సాధించారు. వారు తయారుచేసిన 'అటానమస్ కారు' పసిడి పతకం, లక్ష రూపాయల నగదు గెలుచుకుంది. ఈ నెల 9,10,11చైనాలో జరగబోయే పోటీల్లో ట్రిపుల్ ఐటీ విద్యా ర్థులు పాల్గొననున్నారు. ఈ పోటీలను ఇంటెల్ టెర్రసిక్ డీజీ క్యూట్ సంస్థలు నిర్వహించాయి.

కళాశాలలో ఈసీఈ చివరి సంవత్సం చదువుతున్న సమీర్, నాగరాజు, జాన్​పాల్​ ఈ కారు తయారుచేశారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4 జట్లు పోటీపడగా వారందర్నీ వెనక్కినెట్టి 'అటానమస్ కారు' మొదటి బహుమ తి సొంతం చేసుకుంది. డ్రైవర్ లేకుండా వెళ్లడం తమ కారు ప్రత్యేకత అనీ.. అధ్యాపకుల ప్రోత్సాహంతోనే దీని తయారీ సాధ్యమైందని విద్యార్థులు చెప్పారు. చైనాలో జరిగే పోటీల్లోనూ సత్తా చాటుతామని విశ్వాసం వ్యక్తంచేశారు.నూజివీడు త్రిబుల్ ఐటీ విద్యార్థుల ఘనత సాధించటంపై అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు అభినందించారు. 

 


Tags:    

Similar News