మాజీ ఎంపీ సబ్బం హరి (ఫైల్ ఫొటో)
Sabbam Hari: మాజీ ఎంపీ సబ్బం హరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇటీవల కోవిడ్ బారిన పడిన ఆయన.. మూడు రోజులుగా విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ ఆయన పరిస్థితి విషమించినట్లు వెల్లడించారు వైద్యులు.
సబ్బం హరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ నెల 15న పాజిటివ్ నివేదిక రాగా వైద్యుల సూచన మేరకు మూడు రోజులు హోంక్వారంటైన్లో ఉండి, ఆ తర్వాత ఆస్పత్రిలో చేరారు.