గుంటూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు జిల్లాలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని పిడుగురాళ్ల క్వాలిటీ వాల్‌ కోటింగ్స్‌ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Update: 2020-05-11 02:44 GMT

గుంటూరు జిల్లాలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని పిడుగురాళ్ల క్వాలిటీ వాల్‌ కోటింగ్స్‌ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో వాల్ పుట్టి ముడిసరుకు, పెయింట్స్ మంటల్లో దగ్ధం అయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. పోలీసులు కూడా పరిశ్రమ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

షార్ట్‌ సర్క్యూటే అగ్నిప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మంటలు భారీగా వ్యాపించడంతో పరిశ్రమలో సుమారు రూ.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News