TDP-YCP: వైసీపీ-టీడీపీ మధ్య బిర్యానీ చిచ్చు

TDP-YCP: గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్న పోలీసులు

Update: 2024-02-04 13:15 GMT

TDP-YCP: వైసీపీ-టీడీపీ మధ్య బిర్యానీ చిచ్చు

TDP-YCP: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రావిపాడు గ్రామంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య బిర్యానీ, పులిహోర చిచ్చు లేపింది. చర్చి ప్రారంభోత్సవంలో వైసీపీ నాయకులు బిర్యానీ, టీడీపీ నాయకులు పులిహోర ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Tags:    

Similar News