మాజీ మంత్రి.. వైసీపీ నేత ఇంట విషాదం
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు ఇంట విషాదం నెలకొంది.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు ఇంట విషాదం నెలకొంది. కొప్పన మోహన్ రావు సతీమణి రమాదేవి మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమాదేవి కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తోపాటూ పలువురు వైఎస్సార్సీపీ అగ్ర నాయకులు, నియోజకవర్గ నేతలు సంతాపం తెలిపారు.
కాగా కొప్పన మోహన్ రావు 1978 - 1989 లో కాంగ్రెస్ తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. 1983 - 2004 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. అయితే 2017 లో ఆయన కాంగ్రెస్ ను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. 2019 ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ టిక్కెట్ ఆశించారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన పెండెం దొరబాబు వైపే జగన్ మొగ్గుచూపారు.