Vizag: కేంద్రం ప్రకటనతో భగ్గుమన్న స్టీల్ ప్లాంట్ కార్మికులు

Update: 2021-03-08 14:21 GMT

కేంద్రం ప్రకటనతో భగ్గుమన్న స్టీల్ ప్లాంట్ కార్మికులు

Vizag: కేంద్రం ప్రకటనతో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు భగ్గుమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. కూర్మన్నపాలెం దగ్గర రోడ్డుపై కార్మికులు బైఠాయించడంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాంతో, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్మికులు ఒక్కసారిగా పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    

Similar News