ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రకటించిన వివరాల ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. ఇందులో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్ 3,761 వేల మంది ఉన్నారు. జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 40,13,770 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో (17,33,667) మంది ఓటర్లు ఉన్నారు.
శ్రీకాకుళం 20,64,330
విశాఖ పట్నం - 32,80,028
తూర్పు గోదావరి - 40,13,770
పశ్చిమ గోదావరి - 30,57,922
కృష్ణా - 33,03,592
గుంటూరు - 37,46,072
ప్రకాశం - 24,95,383
నెల్లూరు - 22,06,652
కడప - 20,56,660
కర్నూలు - 28,90,884
అనంతపురం- 30,58,909
చిత్తూరు - 30,25,222