విశాఖపట్నం: జిల్లాలో 4 ప్రభుత్వ 11 ప్రైవేట్ ఆసుపత్రుల తో కలసి మొత్తం 15 ఆసుపత్రులలో 423 ఐసోలేషన్ సింగిల్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ తెలిపారు.
నగరంలోని ఛాతీ ఆసుపత్రి లో 77 మంది కరోనా అనుమానితులు జాయిన్ అవ్వగా వారిలో కరోనా నెగిటివ్ వచ్చిన 59 మందిని డిశ్చార్జ్ చేసి పంపించి వేశారని చెప్పారు. మిగిలిన వారిలో మూడు పాజిటివ్ కాగా మిగిలిన వారి రిపోర్టులో రావలసి ఉన్నది.