పాలకొల్లు: పట్టణంలోని న్యూ లైఫ్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ రూములను డిసిఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఐసోలేషన్ కేంద్రాల్లో మెరుగైన వైద్య సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని, అలాగే కరోనా కేసులకు సంబంధించి చేరే వారికి పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.