Coronavirus: ఏపీలో భయపెడుతోన్న కరోనా సెకండ్ వేవ్

Coronavirus: రోజురోజుకీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి * గత 24గంటల్లో 17వందల 30మందికి వైరస్‌

Update: 2021-04-05 01:31 GMT

కరోన వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ భయపెడుతోంది. రోజురోజుకీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24గంటల్లో 17వందల 30మందికి వైరస్‌ సోకగా ఐదుగురు మృత్యువాత పడ్డారు. దాంతో, ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7వేల 2వందల 39కి చేరింది.

ఇక, గుంటూరు జిల్లాలో అత్యధికంగా 378 కేసులు నమోదు కాగా, చిత్తూరులో 338, విశాఖలో 235, కృష్ణాలో 226, నెల్లూరు 164 కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10వేల 300 యాక్టివ్ కేసులున్నట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

Full View


Tags:    

Similar News