Jagan: ఏపీ పంటనష్టం పై సీఎం జగన్ సమీక్ష

Jagan: రైతులకు అండగా ఉంటామని హామి.. కొనుగోళ్లను వేగవంతం చేయాలన్న సీఎం

Update: 2023-05-04 07:12 GMT

Jagan: ఏపీ పంటనష్టం పై సీఎం జగన్ సమీక్ష

Jagan: ఏపీలో అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు .దీంట్లో బాగంగానే క్యాంపు కార్యాలయంలో సీఎంఓ అధికారులతో సమావేశమయ్యారు. పంటనష్టంపై ప్రాథమిక వివరాలను అధికారుల సీఎం కు వివరించారు.పంటనష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో అండగా ఉంగాలని సీఎం ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎన్యుమరేషన్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీకోసం పెట్టాపన్నారు.రబీ సీజన్‌కు ధాన్యం కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్నారు.రైతులకు ఇబ్బందులు ఉంటే ఫిర్యాదుచేయడానికి టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నారు.

Tags:    

Similar News