Jagan: గోదావరి పుష్కరాల్లో 29మందిని చంద్రబాబు చంపాడు

Jagan: ఎన్టీఆర్‌ను చంపి కూర్చి లాక్కున్న వ్యక్తి చంద్రబాబు

Update: 2023-01-03 08:30 GMT

Jagan: గోదావరి పుష్కరాల్లో 29మందిని చంద్రబాబు చంపాడు 

Jagan: ఎన్టీఆర్‌ను చంపి కూర్చి లాక్కున్న వ్యక్తి చంద్రబాబని సీఎం జగన్ విమర్శించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి..ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్ ఫొటోకు దండలు వేస్తాడన్నారు. గోదావరి పుష్కరాల్లో 29మందిని చంపాడని సీఎం జగన్ ఆరోపించాడు. జనం తక్కువగా వచ్చారని కందుకూరులో ఇరుకు సందుల్లో సభ పెట్టి 8మందిని చంపేశాడని సీఎం జగన్ ఆరోపించాడు.

పార్టీలు, కుల మతాలకు అతీతంగా పెన్షన్‌ అమలు జరుగుతోందని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్. గత ప్రభుత్వం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్‌ ఇచ్చేదని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం మాత్రం 2 వేల 500 నుంచి 2 వేల 750 రూపాయలకు పెన్షన్‌ను పెంచిందని స్పష్టం చేశారు జగన్‌.

Tags:    

Similar News