ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టు చేస్తారా.. జగన్ సర్కార్ పై చంద్రబాబు ఫైర్..

Chandrababu: చలో విజయవాడలో ఉద్యోగుల నిరసనలపై వైసీపీ తీరును టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు.

Update: 2022-02-03 10:30 GMT

ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టు చేస్తారా.. జగన్ సర్కార్ పై చంద్రబాబు ఫైర్..

Chandrababu: చలో విజయవాడలో ఉద్యోగుల నిరసనలపై వైసీపీ తీరును టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రభుత్వలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారంటూ ఫైర్ అయ్యారు. లక్షల మంది ఉద్యోగుల సమస్యలపై జగన్ ప్రభుత్వం అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీసు పహారా మధ్య ఉపాధ్యాయులను నిర్భందించడం విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమేనన్నారు. ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా..? ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా...రాష్ట్రంలో భాగస్వాములు కాదా..? అని ఆయన నిలదీశారు.

Tags:    

Similar News