Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసులో కీలక మలుపు

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసు కీలక మలుపు తిరిగింది.

Update: 2021-04-15 14:10 GMT

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసులో కీలక మలుపు

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు స్వీకరించింది. ఈనెల 22న పిటిషన్‌ను విచారించనున్నట్లు సీబీఐ కోర్టు తెలిపింది.

జగన్‌పై దాఖలైన అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతోందని, కాబట్టి 11 ఛార్జిషీట్లలో ఏ1గా ఉన్న జగన్‌కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని రఘురామ తన పిటిషన్‌లో కోరారు. ప్రజాస్వామ్యానని రక్షించుకునేందుకు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినట్లు రఘురామ తెలిపారు. జగన్ నిర్దోషిలా బయటపడాలనేదే తన ఉద్దేశమన్నారు. పార్టీని రక్షించుకునే బాధ్యత తనపై ఉందన్నారు. 

Tags:    

Similar News