గొల్లప్రోలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా ఆకలి తో అలమటిస్తున్న పేదలకు, బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో గొల్లప్రోలు పట్టణంలో 60 మందికి భోజనాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఆకలితో ఏ వ్యక్తి అలమటించే కూడదని, వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ తోటి నిరుపేదలకు అండగా నిలవాలని సూచించారు.ఈకార్యక్రమంలో గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు, పట్టణ ప్రధానకార్యదర్శి వులవలశెట్టి శ్రీను ,స్వచ్ఛంద సేవకులు తదితరులు పాల్గొన్నారు.