Avinash Reddy: హైదరాబాద్‌లోని కోఠి సీబీఐ ఆఫీస్‌కు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి

Avinash Reddy: వివేకా హత్య కేసులో భాగంగా సీబీఐ కోర్టులో విచారణ

Update: 2023-01-28 09:36 GMT

Avinash Reddy: హైదరాబాద్‌లోని కోఠి సీబీఐ ఆఫీస్‌కు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి

Avinash Reddy: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి హైదరాబాద్‌ కోఠీలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా విచారణకు హాజరయ్యారు. కాసేపట్లో సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ కేసును కడప నుంచి హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని వివేకా కూతురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివేకానందరెడ్డి హత్య కేసు ఏపీ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయింది. 2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు దాదాపు 248 సాక్షులను, అనుమానితులను విచారించారు.

Tags:    

Similar News