Breaking News: ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షలు రద్దు..

టెన్త్, ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టు ఆగ్రహంతో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది.

Update: 2021-06-24 14:03 GMT

ఆదిమూలపు సురేశ్

టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జులై 31లోగా పరీక్షలు నిర్వహించడం సాధ్యంకాదన్న ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టెన్త్‌, ఇంటర్ ఎగ్జామ్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షల నిర్వహణకు, ఫలితాలకు కనీసం 45రోజుల సమయం పడుతుందన్నారు. సుప్రీం ఆదేశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో చర్చించాకే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఆదిమూలపు తెలిపారు.

Tags:    

Similar News