ప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రత కుదింపుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వైసీపీ ప్రభుత్వం తనకు భద్రతను కుదించడంపై హైకోర్టులో పిటీషన్ వేశారు చంద్రబాబు నాయుడు. అయితే ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపంచారు. విచారణ రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. కాగా ఈ భద్రత వ్యవహారంపై రేపు కోర్టు ఏం తీర్పును వెలువరించనుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే తాను మావోయిస్టుల హిట్లిస్టులో ఉన్నానని.. తనకు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించిన భద్రతను పెంచాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. పాత భద్రతను పునరుద్ధరించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.