కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి న్యాయం జరగలేదు-బుగ్గన

Update: 2019-07-05 15:57 GMT

 కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగలేదని ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్రానికి రిప్పజెంటేషన్ ఇచ్చామని, కానీ ఏపీకి ఎలాంటి కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాజధాని నిర్మాణంపై ప్రస్తావనే లేదన్న బుగ్గన.... కనీసం ఏపీ రెవెన్యూ లోటుకు సంబంధించి కేటాయింపులు కూడా చేయలేన్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక కేటాయింపులు ఉంటేనే... ఆంధ్రప్రదేశ్‌ ముందుకెళ్లగలదన్న బుగ్గన.... విభజన హామీలు నెరవేర్చేవరకూ అడుగుతూనే ఉంటామన్నారు. 

Tags:    

Similar News