వరద బాధితులకు పరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
వరద నీటిలో మునిగిన గ్రామాల్లోని ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5వేల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు రూ.10.8 కోట్ల నిధులను విడుదల చేసింది.
ఉభయగోదావరి జిల్లాల్లోని వరద బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వరద నీటిలో మునిగిన గ్రామాల్లోని ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5వేల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు రూ.10.8 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పరిహారాన్ని ఉభయ గోదావరి జిల్లాల్లోని బాధితులకు అధికారులకు అందజేయనున్నారు.