ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్‌

Update: 2021-01-09 12:57 GMT

ఏపీ ఎస్‌ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం ఈ పిటిషన్‌ను విచారించనుంది హైకోర్టు. రాష్ర్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడాన్ని అధికార పక్షం మండిపడుతోంది. రాజకీయ దురుద్దేశ్యంతోనే నిమ్మగడ్డ ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.  

Tags:    

Similar News