ఆంధ్రప్రదేశ్ ఈసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం నాడు ఉన్నత విద్యాశాఖ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అధికారులు ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబర్ 14న రాష్ట్రంలోని 79 కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించారు. 31,891 మంది పరీక్షలకు హాజరుకాగా, 30,654 మంది క్వాలిఫై అయ్యారు. 96.12 శాతం ఉత్తీర్ణత సాధించారు. క్వాలిఫై అయినవారిలో 25160 మంది పురుషులు, 6731 మంది మహిళలు ఉన్నారు.
సబ్జెక్టుల వారీగా ర్యాంకర్లు వీరే
అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ : గొర్తి వంశీకృష్ణ, (అనంతపురం )
బీఎస్సీ మేథమెటిక్స్ : శివాల శ్రీనివాసరావు (శ్రీకాకుళం)
సిరామిక్ టెక్నాలజీ: తూతిక సంతోష్ కుమార్ (ప్రకాశం జిల్లా)
కెమికల్ ఇంజనీరింగ్: ముస్తాక్ అహ్మద్ (గుంటూరు)
సివిల్ ఇంజనీరింగ్: బానోతు అంజలి (ఖమ్మం)
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ : కోడి తేజ (కాకినాడ)
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: నరేష్ రెడ్డి ( కడప)
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: కుర్రా వైష్ణవి ( గుంటూరు జిల్లా రేపల్లే)
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ట్రుమెంటెరషన్ ఇంజనీరింగ్ : ఫృద్వీ ( రంగారెడ్డి)
మెకానికల్ ఇంజనీరింగ్ : గరగా అజయ్ ( విశాఖపట్టణం)
మెటలర్జికల్ ఇంజనీరింగ్ : వరుణ్ రాజు ( విజయనగరం)
మైనింగ్ ఇంజనీరింగ్ : బానాల వంశీకృష్ణ (ములుగు)
ఫార్మసీ: అశ్లేష్ కుమార్( కృష్ణా జిల్లా చల్లపల్లి), శాంతి ( శ్రీకాళుళం జిల్లా మందస)