ఆత్మకూరులో జరిగిన సంఘటనలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఈ ఘటనలన్నీ రెండు వర్గాలకు సంబంధించినవి తప్పా..పార్టీలకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన తర్వాత గ్రామాలలో గొడవలు జరగడం సహజమని సవాంగ్ తెలిపారు. కొందరు నేతలు పోలీసులపై అసభ్యకరంగా మాట్లాడి విషయం మా దృష్టికి వచ్చిందని...వివాదం పెద్దది కాకూడదని భావించి సంయమనం పాటిస్తున్నామని సవాంత్ అన్నారు.