మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారి కుట్రలు భగ్నం చేయండి- ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్

*13 జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ వెబినార్ *దేవాలయాలపై దాడుల ఘటనలు, కేసులు ఛేదన, అరెస్ట్‌లపై చర్చ *తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేసిన డీజీపీ గౌతమ్‌సవాంగ్

Update: 2021-01-19 13:58 GMT

 గౌతమ్ సవాంగ్ ఫైల్ ఫోటో

13 జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ వెబినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాలపై దాడుల ఘటనలు, కేసుల ఛేదన, అరెస్ట్‌లపై చర్చిస్తున్నారు. ఇకపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేస్తున్నారు డీజీపీ సవాంగ్‌. ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులను తిప్పకొట్టాలని పిలుపునిచ్చారు. అంతేకాదు ఇప్పటినుంచి ఆలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు గౌతమ్‌ సవాంగ్‌.

Tags:    

Similar News