రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరుసగా ఢిల్లీ బాట పడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండ్రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లొచ్చారు. ప్రధాని మోడీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు.

Update: 2020-12-14 14:00 GMT

 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరుసగా ఢిల్లీ బాట పడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండ్రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లొచ్చారు. ప్రధాని మోడీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ముఖ్యంగా ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు కేసీఆర్ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. దాంతో, కేసీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చిన రెండ్రోజుల గ్యాప్‌లోనే ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బాటపట్టడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ ఢిల్లీ టూర్‌కు కౌంటర్‌గానే జగన్ హస్తినకు వెళ్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇక, రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.... కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశంకానున్నారు. రాష్ట్ర సమస్యలతోపాటు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News