స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వహణే ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీ కానుంది. నెల రోజుల్లో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో రిజర్వేషన్ల కుదింపు అంశంపై ఎలా ముందుకు పోవాలన్న దానిపై చర్చించనున్నారు. ఈ వ్యవహరంపై కేబినెట్ భేటీలో చర్చించి ఎన్నికల విషయంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు.
మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపై చర్చించనుంది. కేంద్రం అమలు చేయాలని భావిస్తున్న ఎన్ఆరీసీని వ్యతిరేకిస్తూ ఏపీ మంత్రి వర్గంలో ఓ తీర్మానం చేయనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఎన్ఆర్సీ ఏపీలో అమలు చేయలేమని కేంద్రానికి ప్రత్యేక తీర్మానం చేయనున్నట్లు సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు.