విజయవాడలో నేడు బీజేపీ పదాధికారుల సమావేశం.. పురంధేశ్వరి అధ్యక్షతన మీటింగ్
Vijayawada: ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన మీటింగ్
Vijayawada: విజయవాడలో ఇవాళ బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశానికి.. ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు. ఎన్నికల్లో.. ప్రచారం, పోల్ మేనేజ్మెంట్పై ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు జాతీయ నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసి..పార్టీ ముఖ్య నేతలకు ఆ కమిటీల బాధ్యతలు అప్పగించే యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.