ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ 74వ జయంతి వేళ.. ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సేవల్ని ఒకసారి స్మరించుకున్నారు. అయితే కోడెల కుటుంబంపై 19 కేసులు పెట్టి, వైసీపీ నేతలంతా కాకుల్లా పొడుచుకుతిన్నారు. మానసికంగా కృంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేసారు. వైసీపీ క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణ చంద్రబాబు సహా టీడీపీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
చంద్రబాబుపై తీరుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఈ మేరకు శనివారం అంబటి రాంబాబు షాకింగ్ ట్వీట్లు చేశారు. కోడెల జయంతిని పురస్కరించుకుని ఆయన ఆత్మహత్యను వైసీపీ మీదకు నెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఆరు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి అనేక పదవులు నిర్వహించిన అరుదైన నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ అని అంబటి కొనియాడారు. ఇంతకీ కోడెల సెల్ ఫోన్ ఏమైనట్లు! సెల్ ఫోన్ ఫార్మట్ చేయకుండా బయట పెట్టగలరా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.