విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కు రేపే.. సీఎం జగన్ కీలక సూచనలు
విదేశాల్లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన వారు సోమవారం రానున్నారని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
విదేశాల్లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన వారు సోమవారం రానున్నారని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. విమానాశ్రయాల నుంచి క్వారంటైన్ కేంద్రాలకు చేరడానికి ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. వీరికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉచితంగానే అన్ని వసతులు అందించడానికి ఏర్పాట్లు చేయాలని మరోసారి అధికారులకు సీఎం ఆదేశించారు. ఏపీలోకి అడుగుపెట్టేటప్పుడు ఎలాంటి వైద్య పరీక్షలు చేయాలి? తర్వాత ఆ వ్యక్తి అనుసరించాల్సిన ఐసోలేషన్ విధానం ఎలా ఉండాలన్న దానిపై ఒక ప్రోటోకాల్ తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
అమెరికా నుంచి వచ్చేవారు వైజాగ్, విజయవాడ, తిరుపతి, ముంబై, హైదరాబాద్, చెన్నైలాంటి విమానాశ్రయాలకూ చేరుకుంటారని అధికారులు సీఎంకు వివరించారు. దేశంలోనే కోవిడ్–19 అత్యధిక పరీక్షలు చేసే స్థాయికి చేరుకున్నామని, చాలా గట్టిగా పనిచేసి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలుగుతున్నామని సమావేశంలో చర్చించారు. వివిధ రాష్ట్రాల నుంచి 11 చెక్పోస్టుల ద్వారా ఏపీలోకి ప్రవేశిస్తారని అధికారులు సీఎం జగన్కు తెలిపారు.
యాప్ద్వారా ట్రాక్ చేస్తామని, ఆ తర్వాత వారి వివరాలను ఆ గ్రామంలో ఉన్న వాలంటీర్లు, ఏఎన్ఎం, ఆశాకార్యకర్త, అలాగే ప్రతి సచివాలయంలోని హెల్త్ అసిస్టెంట్కు చేరవేయనున్నారు. అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో సీఎం కీలక సూచనలు చేస్తారని అనుమతులు ఉన్న ప్రదేశాల్లో దుకాణాలు 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నందున తగు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.