ఈ నలుగురిలో కరోనా రత్న ఎవరో చెప్పాలి.. విజయసాయిరెడ్డి క్విజ్
ఏపీ కరోనా వైరస్ విజృంబిస్తున్నరాజకీయ నాయకుల మధ్య మాటల యుద్దం మాత్రం ఆగడం లేదు.
ఏపీ కరోనా వైరస్ విజృంబిస్తున్నరాజకీయ నాయకుల మధ్య మాటల యుద్దం మాత్రం ఆగడం లేదు. అధికార ప్రతిపక్షాలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేతలపై సెటైర్ల విసురుతున్నారు. కొందరి నాయకులకు మార్లు పెడుతూ.. క్విజ్ నిర్వహించారు. ఐదుగురు నేతల పేర్లను సూచిస్తూ.. కరోనా రత్న ఎవరు అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయసాయిరెడ్డి టీడీపీ నాయకులను ఉద్దేశించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ క్రింది వారిలో 'కరోనా రత్న' ఎవరు?
1. పెదనాయుడు
2. చిననాయుడు
3. మలమలకృష్ణరాముడు
4. దయనేని రమ
5. భజనా చౌ
24 గంటల్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి.. అంటూ సాయిరెడ్డి పైన ఐదు పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు.