టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి భారీ జరిమానా

Update: 2020-12-01 05:55 GMT

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి 100కోట్ల రుపాయల భారీ జరిమానా విధించారు ఏపీ మైనింగ్‌ అధికారులు. జరిమానా కట్టకపోతే ఆర్‌అండ్‌ఆర్‌ చట్టం కింద ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. త్రిశూల్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ పేరుతో అక్రమాలకు పాల్పడినట్టు తెలియజేశారు. యాడికి మండలం కోనుప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపినట్లు గుర్తించామన్నారు. 14లక్షల మెట్రిక్‌ టన్నుల అక్రమ మైనింగ్‌ జరిపినట్టు జేసీ దివాకర్‌ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News