Anantapuram: నలుగురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

Anantapuram: అనంతపురంలో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Update: 2025-12-11 08:57 GMT

Anantapuram: నలుగురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

Anantapuram: అనంతపురంలో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కేఎస్‌ఆర్‌ జూనియర్‌ కాలేజీలో చదువుతున్న నలుగురు విద్యార్థినులు.. వాస్మోల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారు. వీరిది ముచ్చుకోట గ్రామంగా తెలుస్తోంది. చదువులో వెనుకబడటంతో తల్లిదండ్రులకు వార్డెన్‌ ఫిర్యాదు చేసింది. దీంతో భయానికి గురైన విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే.. నిన్న ఉదయం ఈ ఘటన జరగగా.. పోలీసులు, ఉన్నతాధికారులకు తెలియకుండా విషయాన్ని గోప్యంగా ఉంచింది వార్డెన్‌. 

Tags:    

Similar News