Nellore: మున్సిపల్ కార్మికుల ఆందోళన.. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చెత్త తొలగించిన కార్పొరేషన్ అధికారులు

Nellore: పారిశుద్ధ్య పనులను అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు

Update: 2024-01-02 12:57 GMT

Nellore: మున్సిపల్ కార్మికుల ఆందోళన.. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చెత్త తొలగించిన కార్పొరేషన్ అధికారులు

Nellore: నెల్లూరులో మున్సిపల్ కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. గతం వారం రోజులుగా విధులకు హాజరుకాకుండా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే నగరంలో చెత్త పేరుకుపోవడంతో కార్పొరేషన్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చెత్త తొలగించే ప్రక్రియను స్టార్ట్ చేశారు. అయితే సమాచారం తెలుసుకున్న మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య పనులను అడ్డుకున్నారు. మున్సిపల్ వాహనాల టైర్లలో గాలి తీసి.. వాహనాలను అడ్డుకుని నిరసన తెలియజేశారు. పోలీసుల బందోబస్తు మధ్య పారిశుద్ధ్య పనులను పూర్తి చేయించారు కార్పొరేషన్ అధికారులు.

Tags:    

Similar News