Macherla: అవకాశం కలిపిస్తే రాజకీయాల్లోకి వస్తా: నటుడు సుమన్

సీఎం జగన్ ను ఉద్ద్యేశించి సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను కలిసేందుకు ఐదు సార్లు ప్రయత్నించానని అన్నారు.

Update: 2020-01-25 12:06 GMT

సీఎం జగన్ ను ఉద్ద్యేశించి సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను కలిసేందుకు ఐదు సార్లు ప్రయత్నించానని అన్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సుమన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానుల విషయంలో జగన్ ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కావడం లేదని.. అయితే ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త నిర్ణయాలు తీసుకోవడం సహజమని వ్యాఖ్యానించారు. యువకుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతున్నారన్నారు.

అయితే ఆయనను కలిసేందుకు ఐదుసార్లు ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పారు. అవకాశం కల్పిస్తే రాజకీయాల్లోకి వస్తానని సుమన్ ప్రకటించారు. ఇక అమరావతిలో ధర్నా చేస్తున్న ఆ ప్రాంత రైతులు వారికి ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలని సూచించారు. రైతులకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ మాజీ శాసన సభ్యుడు గౌతు లచ్చన్న కుమారుడు శ్యామ్ సుందర్ శివాజీ తదితర నేతలు పాల్గొన్నారు. 



Tags:    

Similar News