ఏపీ ప్రభుత్వం నన్ను వేధిస్తోంది: ఏబీ వెంక‌టేశ్వ‌రావు

Update: 2021-01-05 10:38 GMT

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎబీ వెంకటేశ్వరరావు ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ ఐఏఎస్‌ సంఘం కార్యదర్శికి లేఖ రాశారు. జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. తనపై ప్రభుత్వ వేధింపులు, వైఖరిని తెలియజేయాలని అనుకుంటున్నట్లు లేఖలో తెలిపారు. తనపై సస్పెన్సన్‌ వేటును హైకోర్టు కొట్టివేసిందని పోస్టింగ్‌ ఇవ్వాలని సూచించిందని లేఖలో తెలిపారు. హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ నెలల తరబడి తనకు పోస్టింగ్‌ ఇవ్వలేదని జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఎబీ తన లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News