కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కేసరపల్లి వద్ద ఆరేంజ్ ట్రావెల్స్ బస్సు ఇళ్లల్లోకి దూసుకెళ్లింది. ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.