Tirumala: అలిపిరి మెట్లమార్గంలో సంచరిస్తున్న చిరుత
Tirumala: అర్ధరాత్రి నడక మార్గానికి సమీపంలో చిరుత సంచారం
Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం.. భక్తులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. అర్థరాత్రి నడక మార్గానికి సమీపంలో చిరుత సంచరించిన దృశ్యాలు.. అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ, టీటీడీ అధికారులు.. నడకదారిలో వెళ్లే భక్తులకు భద్రత పెంచారు.