ఏపీలో కొత్తగా 1,886 కరోనా కేసులు!

ఏపీలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు కాస్తా పెరిగాయని చెప్పాలి.. తాజాగా గడిచిన 24 గంటల్లో 67,910 కరోనా టెస్టులు చేయగా 1,886 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Update: 2020-11-10 15:00 GMT

ఏపీలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు కాస్తా పెరిగాయని చెప్పాలి.. తాజాగా గడిచిన 24 గంటల్లో 67,910 కరోనా టెస్టులు చేయగా 1,886 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,46,245 కి చేరుకుంది. అయితే ఇందులో 20,958 యాక్టివ్ కేసులుండగా 8,18,473 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 2.151 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 12 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,814కి చేరుకుంది.

కరోనా వలన చిత్తూరులో ముగ్గురు, కృష్ణాజిల్లాలో ముగ్గురు అనంతపూర్, తూర్పు గోదావరి, పచ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 60, చిత్తూరులో 291, ఈస్ట్ గోదావరిలో 227, గుంటూరులో 275, కడపలో 67, కృష్ణాలో 269, కర్నూల్ లో 33, నెల్లూరులో 79, ప్రకాశంలో 111, శ్రీకాకుళం 33, విశాఖపట్నం 97, విజయనగరం 62, వెస్ట్ గోదావరి 282 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 87,92,935 కరోనా టెస్టులు నిర్వహించారు.

Tags:    

Similar News