తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసులరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శ్రీనివాసులరెడ్డి మృతి చెందాడు. వివేకా హత్యకేసుతో తనకు సంబంధం లేదంటూ సీఎం జగన్, వైఎస్ భాస్కర్రెడ్డికి లేఖ రాశాడు.