Multi star movie: రానా,రవితేజ మల్టీస్టారర్ సినిమాకి క్రేజీ డైరెక్టర్ కి ఛాన్స్!

Multi star movie: రానా,రవితేజ మల్టీస్టారర్ సినిమాకి క్రేజీ డైరెక్టర్ కి ఛాన్స్!
x
Highlights

Multi star movie: మళ్ళీ మల్టీస్టారర్ సినిమాలకి మంచి క్రేజ్ ఏర్పడింది. యంగ్ హీరో రానా, రవితేజ కాంబినేషన్ లో త్వరలో ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అయిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారు.

మళ్ళీ మల్టీస్టారర్ సినిమాలకి మంచి క్రేజ్ ఏర్పడింది. యంగ్ హీరో రానా, రవితేజ కాంబినేషన్ లో త్వరలో ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అయిన 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

ముందుగా హరీశ్‌ శంకర్‌, సుధీర్‌ వర్మ వంటి యంగ్‌ డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి కానీ అవేమి నిజం కాలేదు. ఇప్పుడు తాజాగా ఈ లిస్టు లోకి మరో దర్శకుడి పేరు కూడా చేరింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సాగర్‌ చంద్ర దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. సాగర్ చంద్ర ఎవరో కాదు గతంలో 'అయ్యారే, అప్పట్లో ఒకడుండే వాడు' వంటి చిత్రాలకి దర్శకత్వం వహించాడు.

అయితే ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర నిర్మాతలు ఈ దర్శకుడితో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.. త్వరలో దీనిపైన అధికార ప్రకటన వెలువడనుంది. రానా, రవితేజ కలిసి చేస్తుండడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక త్వరలో ఈ సినిమాకి సంబంధించిన నటీనటులను ఎంపిక చేయనున్నారు. ఇక ఒరిజినల్ సినిమాకి సాచీ దర్శకత్వం వహించగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్, బిజు మీనన్‌ పోటాపోటీగా నటించారు.

ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలై బాగా ఆకట్టుకుంది. ఇందులో శ్రుతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అటు రానా అరణ్య అనే ఓ సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకండా విరాటపర్వం అనే సినిమాని చేస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories