ప్రభాస్ 20 లో రానా?

ప్రభాస్ 20 లో రానా?
x
Prabhas (File Photo)
Highlights

'సాహో' తరువాత ప్రభాస్ 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ చిత్రం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. తరువాత...

'సాహో' తరువాత ప్రభాస్ 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ చిత్రం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. తరువాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ప్రభాస్ క్రేజ్ నేపథ్యంలో ఒక అద్బుతమైన ఫాంటసీ కథను దర్శకుడు నాగ్ అశ్విన్ సిద్దం చేసాడని సమాచారం. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అవ్వడంతో ప్రస్తుతం సాంకేతిక నిపుణుల గురించి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభాస్ కు ఈ చిత్రంతో పాన్ వరల్డ్ క్రేజ్ ను తెచ్చి పెట్టాలని దర్శకుడు నాగ్ అశ్విన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రభాస్ 21వ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో మొదలు పెట్టి 2022 ఏప్రిల్ లో విదుల చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ చిత్రన్ని దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్టు సమాచారం.

అతి ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం ముందుగా అలియా భట్ ను సంప్రదించగా.. ప్రభాస్ సరసన నటించాలని ఉన్నా.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు 'బ్రహ్మాస్త్ర' వంటి సినిమాల తో బిజీగా ఉండటం.. వంటి కారణాల వల్ల సున్నితంగా తిరస్కరించింది. ఆ తరువాత మరో బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొనె ని సంప్రదించగా.. తన భర్త రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన '83'లో హీరోయిన్ గా నటిస్తున్నానని.. ఆ చిత్రం తరువాత నటించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కు విలన్ గా మరోసారి రానా నటించే అవకాశాలు ఉన్నయాయని తెలుస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories