Mahesh babu message on covid 19 : కరోనాపై ప్రతిఒక్కరూ బాధ్యతగా ఉండాలి.. సూపర్ స్టార్ మెసేజ్

Mahesh babu message on covid 19 : కరోనాపై ప్రతిఒక్కరూ బాధ్యతగా ఉండాలి.. సూపర్ స్టార్ మెసేజ్
x
Highlights

Mahesh babu message on covid 19: కరోనా విజృంభన రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే రోజుకు రికార్డు స్థాయిలోనే కేసులు నమోదు అవుతున్నాయి

Mahesh babu message on covid 19: కరోనా విజృంభన రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే రోజుకు రికార్డు స్థాయిలోనే కేసులు నమోదు అవుతున్నాయి. లాక్ డౌన్ మొదట్లో కేసులు ఈ స్థాయిలో లేకపోయినప్పటికీ సడలింపులు ఇచ్చిన అనంతరం మాత్రం కరోనా విజృంభన అంచనాలను దాటిపోతుంది. ఒక్క హైదరాబాదు లోనే ప్రతిరోజూ 700కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు, మరియు కరోనా పైన అవగాహన కల్పించేందుకు చాలా మంది స్టార్ హీరోలు వీడియో మెసేజ్‌ల ద్వారా ప్రజలలో చైతన్యం నింపుతున్నారు.

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజలంతా జాగ్రత్తతో, బాధ్యతతో వ్యవహరించి కరోనాతో పోరాడాలని తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రజలకు పిలుపును ఇచ్చారు. " లాక్ డౌన్ సడలింపులు తర్వాత కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో మనమంతా బాధ్యతగా వ్యవహరించాలి ప్రతి ఒక్కరు తమను కాపాడుకుంటూ మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా కాపాడాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి.. అంతేకాకుండా భౌతిక దూరం పాటించాలి.. అలాగే, ఆరోగ్య సేతు యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. పాజిటివ్ కేసులను ట్రాక్ చేయడానికి ఈ యాప్ సహాయపడుతుందని మహేష్ వెల్లడించారు. అందరం భద్రతగా, జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి అంటూ మహేష్ పోస్ట్ చేశారు.

ఇక మహేష్ బాబు సినిమాల విషయనికి వచ్చేసరికి ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫేం పరుశురాంతో సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది..

ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, ఫ్రాడ్స్ వంటి విషయాల నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories