Mahesh Babu: 'సర్కారు వారి పాట' కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం..

Mahesh Babu: సర్కారు వారి పాట కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం..
x
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కనున్న మూవీ 'సర్కారు వారి పాట'.

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కనున్న మూవీ 'సర్కారు వారి పాట'. ఇప్పటికే ఈ మూవీకి చెందిన టైటిల్ పోస్టర్ చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగానే ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఆ పోస్టర్ లో మహేష్ లుక్.. టాటూ.. హెయిర్ స్టైల్ మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కథ ఇదే అంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి.

ముఖ్యంగా మహేష్ అభిమానులు కోరుకునే విధంగా ఈ మూవీ స్క్రిప్ట్ ఉందనుందని టాక్. అవినీతికి సంబంధించిన సామాజిక అంశాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఆసక్తికర కథకు అదనంగా రొమాంటిక్ డోస్ కూడా యాడ్ చేశారంట. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో ఈ మూవీ స్క్రిప్ట్ రాసుకున్నారట డైరెక్టర్. ఇందులో హీరో ఓ బ్యాంకు మేనేజర్ గా చేయనున్నాడు. ఆర్థిక నేరాలకు వందల కోట్లు ఎగ్గొట్టిన ఓ బడా వ్యాపారవేత్త దగ్గర నుండి ఆ కోట్ల డబ్బును ఎలా తిరిగి రాబట్టాడనే ప్రయత్నాలను మనకు చూపించేందుకు పరశురామ్ అండ్ టీమ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్త సమర్పణలో నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు లాంటి బాక్సాఫీస్ హిట్ తర్వాత మహేష్ 'సర్కారు వారి పాట' తో చాటేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories