ఈరోజు (మే-19-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్,...
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
నిన్నటి ముఖ్యాంశాలు:
* కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ భోగస్ : కేసీఆర్.....పూర్తి వివరాలు
* నియంత్రిత విధానంలో వ్యవసాయం చేస్తే రైతులకు లాభాలు : సీఎం కేసీఆర్ .....పూర్తి వివరాలు
* లాక్ డౌన్ 4.0 ఏపీలో ఇలా...పూర్తి వివరాలు
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 May 2020 5:01 PM GMT
ఏపీ లో మద్యం అమ్మకాలపై హైకోర్టులో విచారణ
-మద్యం అమ్మకాలపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ
-మద్యం అమ్మకాలను వ్యతిరేకిస్తూ హైకోర్టు కు మొత్తం మూడు పిటిషన్లు దాఖలు
-మద్యం కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించడం లేదని ఆరోపించిన పిటిషనర్
-నిబంధనలు పాటించకపోవడం వల్ల కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు పిటిషనర్
-లాక్డౌన్ నిబంధనలు అనుసరించే వైన్ షాపులకు అనుమతిచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసిన ప్రభుత్వం
-మద్యం అమ్మకాలకు సంబంధించిన పిటిషన్.. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు
- 19 May 2020 5:00 PM GMT
పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం పిప్పర
భార్యను కడతేర్చిన భర్త..
కుటుంబ కలహాలతో ఇరువురి మధ్య చెలరేగిన వివాదం తో భార్యను భర్త హత్య చేసినట్లు ప్రాథమికంగా అంచనా..
తానే తన భార్యను హత్య చేసినట్లు పోలీసులకు లొంగి పోయిన వైనం
- 19 May 2020 4:56 PM GMT
విజయవాడ నగర శివారులో ఎన్ఫోర్సుమెంట్ పోలీసులు నాకాబంది
-రూ.60 వేలు విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం.
- 10 మందిని అదుపులోకి తీసుకుని నున్న గ్రామీణ పోలీసులకు అప్పగింత.
-రెండు కార్లు, 8 మోటార్ సైకిళ్ళు స్వాధీనం.
- గ్రీన్ జోన్ల నుండి రెడ్ జొనుల్లోకి మద్యం సరఫరా చేస్తుండగా పట్టివేత.
- 19 May 2020 4:16 PM GMT
నేడు తెలంగాణలో కొత్తగా 42 కేసులు నమోదు
-ఈ రోజు ఒక్కరోజే 42 కేసులు నమోదు
-ఇందులో 34 కేసులు GHMC పరిధిలోనివి
-ఇవాళ ఒక్కరోజే 10 మంది డిశ్చార్జ్ అయ్యారు
-ఇప్పటి వరకు కరోనాతో పోరాడి 1011 మంది డిశ్చార్జ్ అయ్యారు.
-ప్రస్తుతం రాష్ట్రంలో 556 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
-ఇప్పటి వరకు 38 మంది చనిపోయారు.
-రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1634కి చేరింది.
- 19 May 2020 4:07 PM GMT
ఏపీలో తిరగనున్న ఆర్టీసీ బస్సులు...
-ఈ నెల 21 తేదీ నుండి ఏపీలో తిరగనున్న ఆర్టీసీ బస్సులు..
-పెద్ద నగరాల్లోనూ బస్సులు నడపనున్న ఆర్టీసీ..
-Online లో మాత్రమే టికెట్ బుకింగ్స్ కు అనుమతి..
-ఆర్డినరీ కూడా అదే పరిస్థితి
- 19 May 2020 4:05 PM GMT
మదనపల్లెలో అగ్నిప్రమాదం
-మదనపల్లె టౌన్ స్థానిక కదిరి రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ బరోడా బిల్డింగ్ లో అగ్నిప్రమాదం.
-మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది మరియు పోలీసులు.
-బ్యాక్ ఆఫ్ బరోడాలో అగ్ని ప్రమాదం జరిగిన టైంలో బ్యాంకు సిబ్బంది ఎవరూ లేకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది పోలీసులు సంఘటన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.
- 19 May 2020 4:03 PM GMT
ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ
♦ బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్గా కె. ప్రవీణ్ కుమార్.
♦ రజత్ భార్గవ్కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖలు.
♦ క్రీడలు, యువజనసంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్గోపాల్.
♦ ఎస్టీ వెల్ఫేర్ గిరిజనసంక్షేమం సెక్రటరీగా కాంతిలాల్ దండే.
♦ సర్వే, లాండ్ సెటిల్మెంట్స్ డైరెక్టర్గా సిద్ధార్థజైన్కు అదనపు బాధ్యతలు.
♦ మత్స్యశాఖ కమిషనర్గా కన్నబాబుకు అదనపు బాధ్యతలు.
♦ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జి.శ్రీనివాసులు.
♦ అనంతపురం జేసీ(అభివృద్ధి)గా ఎ.సిరి.
♦ సివిల్ సప్లైస్ డైరెక్టర్గా దిల్లీరావు.
♦ శాప్ ఎండీగా వి.రామారావుకు అదనపు బాధ్యతలు.
♦ దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్గా పి.అర్జున్రావు.
♦ సీతంపేట ఐటీడీఏ ఈవోగా చామకూరి శ్రీధర్.
♦ నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా స్వప్నిల్ దినకర్.
♦ కాకినాడ మున్సిపల్ కమిషనర్గా సునీల్కుమార్రెడ్డి.
♦ ఫైబర్ నెట్ ఎండీ ఎం. మధు సూదన్ రెడ్డి.
♦ ఏపీ ఎండీసీ ఎండీ(ఇంచార్జ్)గా వీజీ వెంకట్రెడ్డి.
- 19 May 2020 3:15 PM GMT
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి విధులు ప్రారంభించాలని ఆదేశాలు
-ఈనెల 21వ తేది నుంచి 100 శాతం ఉద్యోగులతో గవర్నమెంట్ ఆఫీసులలో పనులు
-కరోనా జాగ్రత్తలు తీసుకునేలా ప్రత్యేక చర్యలు
-గర్బిణిస్త్రీలు, వృద్దులు, ధీర్ఘకాలిక వ్యాధులతో భాధపడేవారు వర్క్ ఫ్రమ్ హోం
-ప్రతీ ప్రభుత్వ కార్యాలయం మెయిన్ గేట్ ముందు శానిటైజర్లు ఉంచాలి
-ప్రతీ ఉద్యోగు ఖఛ్చితంగా మాష్క్ ధరించాలి, కార్యాలయంలో సోషల్ డిస్టెన్స్ పాటింఛాలు
-వీలైనన్ని సార్లు చేతులు కడుక్కోవాలి
-కార్యాలయాలలో ఛైర్స్ కూడా కనీసం 6 అడుగుల దూరంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి
-బహిరంగ ప్రధేశాలలో గుట్కాలు, నిషేధిత పధార్దాలు, ఉ మ్ములు వేయరాదు వేస్తే కఠిన చర్యలు
-సమావేశాలు చర్చలు పెట్టరాదు అత్యవసరమైతే వీడియో టెలికాన్పరెన్స్ నిర్వహించాలి
-ఈ ఫైలింగ్ ద్వారానే పైల్స్ వర్క్ చేయాలి
- 19 May 2020 1:43 PM GMT
ఎంఫాన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి : మంత్రి అవంతి శ్రీనివాస్
*తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ జిల్లా మంగమారిపేట బీచ్ చేంజ్ సందర్శించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు,
*స్థానిక మత్య కారులతో మాట్లాడిన మంత్రి.
*ఎంఫాన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మత్య కారులకు సూచన.
*మంగ మారి పేటలో ముందుకు వచ్చిన సముద్రపు అలలు
*మంగమారి పేట గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులకు జాగ్రత్తలు సూచించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు
*తీరం దాటిన సమయంలో తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి అవంతి
*వలలు బోట్లను తీరానికి దూరంగా ఉంచాలని గ్రామస్తులను అప్రమత్తం చేసిన మంత్రి అవంతి శ్రీనివాసరావు
- 19 May 2020 12:07 PM GMT
56 రోజుల తరువాత తెలంగాణాలో ఆర్టీసీ బస్సులు రోడ్లపై పరుగులు తీశాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి బస్సులు నడుస్తున్నాయి.
ఈ నేపధ్యంలో మహబూబ్ నగర్ నుంచి బయలు దేరిన ఒక బస్సులో తెలంగాణా మంత్రి శ్రీనివాస గౌడ్ ప్రయాణించారు.
మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రయాణించి కోవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పరిశీలించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire